ధరణి రచ్చబండ..

ABN , First Publish Date - 2022-07-06T21:05:10+05:30 IST

దున్నే వానిది భూమి లేకుండా కేసీఆర్ చేస్తుండు, ఫార్మా సిటీ కోసం అడ్డగోలుగా భూములను దోచే ప్రయత్నం చేస్తుండు కేసీఆర్ ఎక్కడ భూములున్నా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.

ధరణి రచ్చబండ..

హైదరాబాద్: కాంగ్రెస్ పంచిన భూములను టీఆరెస్ లాక్కుని పేదవాడికి అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే మీడియాతో సీతక్క మాట్లాడారు. భూముల విలువ పెంపకం పేరుతో దందాలు జరుగుతున్నాయి. దున్నే వానిది భూమి లేకుండా కేసీఆర్ చేస్తుండు, ఫార్మా సిటీ కోసం అడ్డగోలుగా భూములను దోచే ప్రయత్నం చేస్తుండు కేసీఆర్ ఎక్కడ భూములున్నా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులు కూడా భూములను లాకుంటున్నారు. పోడు రైతులపై దాడులు చేస్తున్నారు. 


మహబూబాబాద్ జిల్లా నారాయణపూర్ లో ధరణితో 18వందల ఎకరాలు ఆగం అయ్యాయి. భూమి అంటే తరతరాలుగా వచ్చే ఆధారం. అడవులున్న చోటే మళ్లీ అడవుల పెంపకం కాంగ్రెస్ పంచితే.. టీఆరెస్ గుంజుకుంటోంది. ప్రైవేట్ కంపెనీలకు పంచుతుండు..భూ సమస్యలతో చాలా మంది చనిపోతున్నారు. మొన్నటివరకు ఖాళీగా వున్న సర్కార్ ల్యాండ్ ..తర్వాత టీఆరెస్ నేతల పేర్లకు మారుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేసారు.



Updated Date - 2022-07-06T21:05:10+05:30 IST