విశాఖలో డీజీపీ సుడిగాలి పర్యటన
ABN , First Publish Date - 2020-07-05T08:59:42+05:30 IST
డీజీపీ గౌతమ్సవాంగ్ శనివారం విశాఖ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. శనివారం ఉదయాన్నే కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ కార్యాలయాన్ని, ఏపీఐఐసీ భూములను
విశాఖపట్నం, జూలై 4(ఆంధ్రజ్యోతి): డీజీపీ గౌతమ్సవాంగ్ శనివారం విశాఖ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. శనివారం ఉదయాన్నే కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ కార్యాలయాన్ని, ఏపీఐఐసీ భూములను పరిశీలించారు. గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయం కోసం జగన్నాథపురంలో కేటాయించిన 380 ఎకరాలను, సింహాచలంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. విశాఖలో పోలీస్ ప్రధాన కార్యాలయాలు, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను చూశారు. రుషికొండ ఐటీ పార్కులోని ఓ భవనాన్ని (డీజీపీ కార్యాలయం కోసం!) పరిశీలించారు. అదే కొండపై సీఐడీ కార్యాలయం కోసం భవనాలు చూడాలని చెప్పారు.