డీజీపీ సవాంగ్‌ శారదా పీఠం సందర్శన

ABN , First Publish Date - 2022-02-13T02:46:54+05:30 IST

విశాఖలోని శారదా పీఠాన్ని శనివారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సందర్శించారు. పీఠం అధిష్ఠాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు.

డీజీపీ సవాంగ్‌ శారదా పీఠం సందర్శన

పెందుర్తి: విశాఖలోని శారదా పీఠాన్ని శనివారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సందర్శించారు. పీఠం అధిష్ఠాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. శారదా పీఠం వార్షికోత్సవాలకు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయానని పీఠాధిపతితో డీజీపీ చెప్పారని పీఠం శ్రీకార్యం తెలిపింది. డీజీపీ వెంట శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ రవిశంకర్‌, గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డీజీ ఆర్కే మీనా, విశాఖ రేంజ్‌ ఐజీ కాళిదాసు రంగారావు ఉన్నారు.

Updated Date - 2022-02-13T02:46:54+05:30 IST