ఏబీఎన్ ఎఫెక్ట్: ఏలూరు డీఎఫ్ఓ, రేంజర్ సస్పెన్షన్

ABN , First Publish Date - 2020-09-19T15:48:07+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మల్లుకుంట వద్ద కొబ్బరి మొక్కల అక్రమ రవాణాపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో

ఏబీఎన్ ఎఫెక్ట్: ఏలూరు డీఎఫ్ఓ, రేంజర్ సస్పెన్షన్

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మల్లుకుంట వద్ద కొబ్బరి మొక్కల అక్రమ రవాణాపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు. రాజమండ్రి అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్ దీనిపై విచారణ నిర్వహించారు. ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ అయింది. ఏలూరు సామాజిక వన విభాగం డీయఫ్‌ఓ శ్రీనివాసరావు, రేంజర్ కొండలరావు సస్పెన్షన్‌కు గురయ్యారు. 


Updated Date - 2020-09-19T15:48:07+05:30 IST