వారి పేర్లు డైరీలో రాస్తున్నాం: దేవినేని

ABN , First Publish Date - 2020-07-09T03:05:26+05:30 IST

రాష్ట్రం ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు.

వారి పేర్లు డైరీలో రాస్తున్నాం: దేవినేని

విజయవాడ: రాష్ట్రం ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు. తప్పు చేస్తున్న అధికారులందరి పేర్లు డైరీలో రాస్తున్నామని అన్నారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేసుకుందని ఆరోపించారు. రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వైఫల్యాలపై గళం ఎత్తుతున్న బీసీ నేతలను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్నారు. టీడీపీ నేతలపై బనాయిస్తున్న అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని దేవినేని చెప్పారు.

Updated Date - 2020-07-09T03:05:26+05:30 IST