ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప అభివృద్ధి శూన్యం: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-06-06T16:54:56+05:30 IST

అమరావతి: ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప అభివృద్ధి శూన్యం: దేవినేని ఉమ

అమరావతి: ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. తాగునీరు ఇవ్వలేకపోతున్నామని.. మాఫియాకు తప్ప తమకు కూడా ఇసుక దొరకడం లేదంటున్న మీ నేతల మాటలకు సమాధానమివ్వండని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ‘‘ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యం. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు.. తాగునీరు ఇవ్వలేకపోతున్నాం.. మాఫియాకు తప్ప మాకు కూడా ఇసుక దొరకడం లేదని మీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలే కాదు మీ నాయకులు అన్న మాటలకు సమాధానం చెప్పండి జగన్‌గారూ’’ అని దేవినేని ఉమ ట్వీట్‌లో ప్రశ్నించారు.


Updated Date - 2020-06-06T16:54:56+05:30 IST