ఏపీలో లాంతర్లు, సెల్ ఫోన్ లైట్ల వెలుగులో విద్యార్థుల చదువులు: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2022-04-28T18:23:01+05:30 IST

దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీలో లాంతర్లు, సెల్ ఫోన్ లైట్ల వెలుగులో విద్యార్థుల చదువులు: దేవినేని ఉమ

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఏపీలో లాంతర్లు, సెల్ ఫోన్ లైట్ల వెలుగులో విద్యార్థుల చదువులు... కరెంటు కోతలతో పరీక్షల వేళ టెన్త్, ఇంటర్ విద్యార్ధుల ఇక్కట్లు.. విద్యుత్ బిల్లులు తల్లిదండ్రులకు షాక్ కొడుతుంటే, కరెంట్ కోతలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.. ఇది మీ అసమర్థపాలనకు నిదర్శనంకాదా?’’ అంటూ దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-28T18:23:01+05:30 IST