ఉత్కంఠగా కొనసాగుతున్న దేవినేని ఉమ విచారణ

ABN , First Publish Date - 2021-04-29T23:28:39+05:30 IST

మంగళగిరి సీఐడీ కార్యాలయంలో టీడీపీ నేత దేవినేని ఉమ విచారణ ఉత్కంఠగా కొనసాగుతోంది. విచారణపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉత్కంఠగా కొనసాగుతున్న దేవినేని ఉమ విచారణ

అమరావతి: మంగళగిరి సీఐడీ కార్యాలయంలో టీడీపీ నేత దేవినేని ఉమపై విచారణ ఉత్కంఠగా కొనసాగుతోంది. విచారణపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఉమను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన తరపు నాయ్యవాదిని లోపలకు పిలవకుండా విచారణ చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఉమకు భోజనం కూడా ఇవ్వలేదని టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్‌పై సీఐడీ ప్రశ్నించినట్లు సమాచారం. ప్రెస్‌మీట్‌లో దేవినేని ఉమ ఉపయోగించిన సెల్‌ఫోన్‌, ట్యాబ్‌ ఎక్కడని అధికారులు అడిగారు. సంతృప్తి చెందకపోతే శుక్రవారం కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. గురువారం ఉదయం 10.30కి మంగళగిరి సీఐడీ కార్యాలయంలో దేవినేని విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ హెడ్ క్వార్టర్‌లో ఆయన విచారణకు హాజరయ్యారు. 

Updated Date - 2021-04-29T23:28:39+05:30 IST