వైసీపీ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యం: ధూళిపాళ్ల
ABN , First Publish Date - 2020-06-06T20:54:27+05:30 IST
వైసీపీ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తున్నారని, నవరత్నాల పేరుతో నయా దోపిడీకి తెరలేపారని తప్పుబట్టారు.
అమరావతి: వైసీపీ ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తున్నారని, నవరత్నాల పేరుతో నయా దోపిడీకి తెరలేపారని తప్పుబట్టారు. రూ.3 వేల పింఛను ఇస్తామని సీఎం జగన్ మాట తప్పారని, లక్షల పెన్షన్లు తొలగించి పేదల పొట్ట కొట్టారని ధ్వజమెత్తారు. ప్రచారాలకు దూరమంటూనే ప్రకటనలకు కోట్లు ఖర్చు చేస్తున్నారని, పేదలకు ఇళ్ల పేరుతో విలువైన స్థలాలను కాజేశారని ధూళిపాళ్ల నరేంద్ర దుయ్యబట్టారు.