మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నాం: కేటీఆర్

ABN , First Publish Date - 2021-12-16T21:47:08+05:30 IST

మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణ, పల్లెప్రగతి కింద

మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నాం: కేటీఆర్

సంగారెడ్డి: మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణ, పల్లెప్రగతి కింద రూ 3,140 కోట్లు నిధులిచ్చామని తెలిపారు. గతంలో మున్సిపాలిటీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. పార్టీలకతీతంగా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను.. క్రమబద్ధీకరణ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కరోనా దృష్ట్యా ప్రజారవాణా వ్యవస్థలు నష్టాల్లో ఉన్నాయని, ఇప్పట్లో సంగారెడ్డికి మెట్రోరైలు నిర్మాణం సాధ్యం కాదని కేటీఆర్ తెలిపారు.

Updated Date - 2021-12-16T21:47:08+05:30 IST