చంద్రబాబు లైవ్లో ఉండగా దేవాన్ష్ ఎంట్రీ.. ఇంతలో..!
ABN , First Publish Date - 2020-08-15T18:25:15+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రజ్యోతి నెట్వర్క్ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న సంగతి తెలిసిందే. భాగ్యనగరంలో ఉంటూనే పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. రెండ్రోజులకోసారి జూమ్లో మీడియాతో మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా మూడు రాజధానులు, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రభుత్వంపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల జూమ్లో జరిగిన సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సన్నివేశాన్ని గమనించిన టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ఓ వీడియోను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సన్నివేశం ఏమిటి..? ఆ వీడియో వెనుక కథేంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.
అసలేం జరిగిందంటే..
చంద్రబాబు శుక్రవారం నాడు జూమ్లో ప్రెస్మీట్ నిర్వహించారు. బాబు మాట్లాడుతుండా ఆయన మనవడు దేవాన్ష్ సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే తాతయ్య ఆన్లైన్లో మీడియాతో మాట్లాడుతున్నట్లు తెలుసుకున్న బుడ్డోడు కెమెరా కంటపడకుండా తిన్నగా కింద పాకుతూ పక్కకు జరిగాడు. చంద్రబాబు వెనుకవైపు సెల్ఫ్లో బుక్ తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ బుక్ పేరు ‘అక్బర్ బీర్బల్’ కథలు. ఈ వీడియో క్లిప్ను కట్ చేసిన తెలుగు తమ్ముళ్లు, అభిమానులు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. నిజంగా లోకేష్ కుమారుడు ఈ వయస్సులో ఇంత క్రమశిక్షణతో మెలుగుతున్నాడంటే నిజంగా గ్రేటే అని అభిమానులు చెప్పుకుంటున్నారు.
కామెంట్ల వర్షం..
ఈ వీడియోను కొందరు అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా.. మరి కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘తాతయ్య వీడియో కాన్ఫరెన్సులో ఉన్నారు అని అర్ధం అయ్యి ఆ వీడియోలో కనపడి డిస్టర్భ్ చెయ్యకూడదని తను కనపడకుండా ఉండడానికి కింద పాక్కుంటూ వెళ్ళి తనకు కావలిసిన పుస్తకం తీసుకుని వెళ్ళిపోతున్నాడు దేవాన్ష్. ఈ వయసుకే ఇంత పరిపక్వత అంటే మామూలు విషయం కాదు’ అని టీడీపీ వీరాభిమాని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. ఇలా పలువురు అభిమానులు కామెంట్లు, షేర్లు, లైక్ల వర్షం కురిపించారు.