‘తీవ్రం’గా అల్పపీడనం

ABN , First Publish Date - 2020-11-30T10:28:10+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి సోమవారం సాయంత్రంకల్లా

‘తీవ్రం’గా అల్పపీడనం

హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి సోమవారం సాయంత్రంకల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబరు 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రం లో మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందన్నారు. కాగా ఆదివారం ఉదయం నిర్మల్‌లో 15.9 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లలో 16.2, ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - 2020-11-30T10:28:10+05:30 IST