కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు

ABN , First Publish Date - 2021-12-13T19:37:09+05:30 IST

కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు ప్రభావంపై నోటీసులు ఎన్‌హెచ్‌ఆర్సీ ఇచ్చింది.

కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు

న్యూఢిల్లీ: కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు ప్రభావంపై నోటీసులు  ఎన్‌హెచ్‌ఆర్సీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు ప్రభావంపై అధ్యయనం చేసి 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ముంపు అధికంగా ఉందంటూ ఎన్‌హెచ్‌ఆర్సీలో లాయర్ శ్రావణ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో ఇటీవల 30 - 40వేల ఎకరాల పంట నష్టం వాటిల్లిందంటూ  ఈ విషయాన్ని లాయర్ ఎన్‌హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. 

Updated Date - 2021-12-13T19:37:09+05:30 IST