కేఎన్‌ఆర్‌ సంస్థ మాజీ ఈడీకి ఢిల్లీ కోర్టు సమన్లు

ABN , First Publish Date - 2021-03-05T08:47:55+05:30 IST

చీటింగ్‌ కేసులో హైదరాబాద్‌కు చెందిన కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ సంస్థ మాజీ ఎగ్జ్జిక్యూటివ్

కేఎన్‌ఆర్‌ సంస్థ మాజీ ఈడీకి ఢిల్లీ కోర్టు సమన్లు

చీటింగ్‌ కేసులో హైదరాబాద్‌కు చెందిన కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ సంస్థ మాజీ ఎగ్జ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సినీ నిర్మాత జెట్టి వెంకట ఫణీంద్ర రెడ్డికి దక్షిణ ఢిల్లీ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. 2015లో కేఎన్‌ఆర్‌ సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో షేర్ల కొనుగోలుకుగాను ఫణీంద్ర రెడ్డికి రూ.32.4 కోట్లు చెల్లించానని, కానీ తన పేరిట షేర్లను బదిలీ చేయకుండా మోసం చేశారంటూ ఢిల్లీ వ్యాపారవేత్త షేక్‌ అబ్దుల్‌ హమీద్‌ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


విచారణ జరిపిన పోలీసులు చివరకు కేసును మూసివేస్తున్నట్లు 2018లో ప్రకటించారు. దీనిని సవాలు చేస్తూ హమీద్‌ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. ఐపీసీ 406, 420 సెక్షన్ల ప్రకారం దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది.  


Updated Date - 2021-03-05T08:47:55+05:30 IST