డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల
ABN , First Publish Date - 2022-06-30T05:21:21+05:30 IST
డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్, జూన్ 29: కాకతీయ యూనివర్సిటీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎ, బీఏ లాంగ్వేజేస్తో పాటు ఇతర కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యా యి. బుధవారం కేయూ వీసీ ప్రొఫెసర్ టి.రమేశ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.వెంకట్రామిరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ప్రొ ఫెసర్ పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ప్రొఫెసర్ జె.మధుకర్, డాక్టర్ ఎ.సురేంద్లు విడుదల చేశారు. అన్ని కోర్సులు, సెమిస్టర్లలో 82,416 మంది పరీక్షలు రాయగా 23,983 మంది ఉత్తీర్ణత (29.10శాతం) సాధించారు. కాగా, మొదటి సెమిస్టర్లో 82,416 మంది పరీక్షలు రాయగా 23,983 (29.10శాతం), మూడో సెమిస్టర్లో 52,213 మంది (36.43 శాతం), ఐదో సెమిస్టర్లో 39,100 (58.58 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఫలితాలు కేయూ వెబ్సైట్ లో చూడాలని కోరారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో క్యాంపు ఆఫీసర్ డాక్టర్ ఎ.రాజు, ఏఆర్ జి.రాములు పాల్గొన్నారు.