డీఈడీ కాలేజీలపై విచారణ వాయిదా

ABN , First Publish Date - 2020-10-01T08:51:07+05:30 IST

రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ఇప్పటికే జరిగిన స్పాట్‌ అడ్మిషన్లను ప్రభుత్వం అనుమతించడం లేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది...

డీఈడీ కాలేజీలపై విచారణ వాయిదా

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ఇప్పటికే జరిగిన స్పాట్‌ అడ్మిషన్లను ప్రభుత్వం అనుమతించడం లేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చేసిన అభ్యర్థనతో న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణను అక్టోబరు 16వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈ పిటిషన్లపై రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో కనిపించారు. అయితే, ఆయన చేతికి సెలైన్‌, ఆక్సీమీటర్‌ తదితరాలు ఉన్నాయి. దీంతో ఏమైందని అందరూ అడగ్గా.. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.  

Updated Date - 2020-10-01T08:51:07+05:30 IST