ఉన్నత విద్యామండలి ఎక్స్‌లెన్స్‌ అవార్డులకు గడువు 31

ABN , First Publish Date - 2022-05-15T08:11:25+05:30 IST

ఉన్నత విద్యామండలి ఎక్స్‌లెన్స్‌ అవార్డుల దరఖాస్తు గడువు ఏప్రిల్‌తో ముగిసినా, పలు విజ్ఞప్తుల మేరకు ఈ నెలాఖరు

ఉన్నత విద్యామండలి ఎక్స్‌లెన్స్‌ అవార్డులకు గడువు 31

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యామండలి ఎక్స్‌లెన్స్‌ అవార్డుల దరఖాస్తు గడువు ఏప్రిల్‌తో ముగిసినా, పలు విజ్ఞప్తుల మేరకు ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో చదువుతున్న విద్యార్థులకు ఎక్స్‌లెన్స్‌ అవార్డులు ఇవ్వనున్నారు. వీటికింద ఎంపికయ్యేవారికి వరుసగా లక్ష రూపాయలు, రూ.60వేలు, రూ.30వేలు, మరో నలుగురికి రూ.10వేల చొప్పున అందజేస్తామని తెలిపారు. ఏపీఎ్‌ససీహెచ్‌ఈ.ఏపీ.గవ్‌.ఇన్‌/ఎక్స్‌లెన్స్‌ అవార్డు అనే వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

Updated Date - 2022-05-15T08:11:25+05:30 IST