చెత్తబండిలో మృతదేహాల తరలింపు
ABN , First Publish Date - 2020-08-12T08:58:18+05:30 IST
నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన మహిళ, మరో వ్యక్తి కరోనాతో మృతి చెందారు.
కావలి, ఆగస్టు 11: నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన మహిళ, మరో వ్యక్తి కరోనాతో మృతి చెందారు. మున్సిపాలిటీ అధికారులు ఆ మృతదేహాలను సోమవారం సాయంత్రం చెత్త తరలించే ట్రాక్టర్లో తీసుకెళ్లి కావలి శ్మశానవాటికలో ఖననం చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.