మరోసారి ‘మైండ్‌బ్లాక్’ చేసిన వార్నర్ దంపతులు

ABN , First Publish Date - 2020-05-31T23:12:10+05:30 IST

మరోసారి ‘మైండ్‌బ్లాక్’ చేసిన వార్నర్ దంపతులు

మరోసారి ‘మైండ్‌బ్లాక్’ చేసిన వార్నర్ దంపతులు

తెలుగు సినిమా డైలాగులు చెబుతూ, తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌లేస్తూ ఆకట్టుకుంటున్నాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడు డేవిడ్ వార్నర్. ‘అల వైకుంఠపురములో..’ చిత్రంలోని ‘రాములో.. రాముల..’, ‘బుట్టబొమ్మ’ పాటలకు వార్నర్ గతంలో చిందులేశాడు. 


తాజాగా సూపర్‌స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్‌బ్లాక్’ పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అయితే మరోసారి ‘మైండ్‌బ్లాక్’ పాటపై వార్నర్ తన భార్య క్యాండీస్‌తో కలిసి చిందులు వేసి.. సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ‘‘రెండో పార్ట్. ఇది చాలా కఠినమైంది. కానీ చేయకుంటే.. కాండీస్ నన్ను చంపేస్తుంది. మూడో పార్ట్ కావాలా?’’ అంటూ వార్నర్.. మహేశ్ బాబు, రష్మికా మందన్నలను ట్యాగ్ చేశాడు. 



Updated Date - 2020-05-31T23:12:10+05:30 IST