తహసీల్దార్ కార్యాలయంలో అంధకారం
ABN , First Publish Date - 2022-08-06T09:16:26+05:30 IST
తహసీల్దార్ కార్యాలయంలో అంధకారం
ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో అంధకారం నెలకొంది. కరెంట్ బిల్లు బకాయిలు భారీగా ఉండటంతో విద్యుత్ శాఖ సిబ్బంది ఫీజులు పట్టుకుపోయారు. కరెంట్ లేకపోవటంతో ఉద్యోగులు చీకట్లో, సెల్ఫోన్ వెలుతురులో విధులు నిర్వహించారు. ఈ పరిస్థితి జిల్లావ్యాప్తంగా పలు ్లకార్యాలయాల్లోనూ నెలకొంది. దాదాపు రూ.310 కోట్లు బకాయిలు ఉన్నట్టు తెలిసింది. తాగునీటి ఫథకాలకు సంబంధించిన కనెక్షన్లు తొలగించడంతో జనం నీటికి ఇబ్బందులు పడుతున్నారు.
- ఆంధ్రజ్యోతి, ఒంగోలు