దేశానికే దిక్సూచిగా దళితబంధు: మంత్రి కొప్పుల

ABN , First Publish Date - 2022-02-04T02:28:34+05:30 IST

తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు

దేశానికే దిక్సూచిగా దళితబంధు: మంత్రి కొప్పుల

హనుమకొండ: తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు దిక్సూచిగా నిలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో దళిత బంధు పథకంపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్దదారులకు రూ.4.81కోట్ల విలువైన వివిధ అసెట్స్ డిస్ట్రిబ్యూటీ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు తెచ్చారని ఆయన కొనియాడారు. 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి 100మందిని ఎంపిక చేసి దళితబంధును అందిస్తామన్నారు. లబ్దిదారుల ఎంపికలో శాసనసభ్యుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటాన్నారు. మార్చి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-04T02:28:34+05:30 IST