హైదరాబాద్: దళిత బంధు కార్యక్రమానికి జీవో విడుదల

ABN , First Publish Date - 2021-08-05T19:54:47+05:30 IST

తెలంగాణలో దళిత బంధు అమలయింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి...

హైదరాబాద్: దళిత బంధు కార్యక్రమానికి జీవో విడుదల

హైదరాబాద్: తెలంగాణలో దళిత బంధు అమలయింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి ఈ పథకం ప్రారంభించారు. దీనికి సంబంధించి గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వాసాలమర్రిలో అర్హులైన 76 దళిత కుటుంబాలకు రూ.7.60 కోట్ల నిధులను విడుదల చేశారు.


నిన్న వాసాలమర్రి పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. దీంతో ఇవాళ ఆ నిధులను విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకానుంది.

Updated Date - 2021-08-05T19:54:47+05:30 IST