కోవిడ్ ఆశ్రయ సెంటర్‌ సేవలు వినియోగించుకోండి: సీపీ సజ్జనార్

ABN , First Publish Date - 2021-05-12T22:27:41+05:30 IST

సైబరాబాద్‌లో కరోనా పేషంట్స్ కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థల సహాయ, సహకారంతో కోవిడ్ పేషేంట్స్ కోసం...

కోవిడ్ ఆశ్రయ సెంటర్‌ సేవలు వినియోగించుకోండి: సీపీ సజ్జనార్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా విజృంభిస్తోందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. గతంలో మహారాష్ట్రలో కేసులు సంఖ్య పెరగడంతో రాష్ట్రంలో కూడా కేసులు పెరిగాయన్నారు. సైబరాబాద్‌లో కరోనా పేషంట్స్ కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థల సహాయ, సహకారంతో కోవిడ్ పేషేంట్స్ కోసం కోవిడ్ మెడికల్ కేర్ సెంటర్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. కోవిడ్ ఆశ్రయ సెంటర్‌లో ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూలతో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 30 మంది పేషేంట్స్ ఇందులో చికిత్స తీసుకున్నారన్నారు. ఆరోగ్య భద్రత, ఆరోగ్య శ్రీ కార్డ్స్ ఉన్న వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామన్నారు. సైబరాబాద్ సెక్యూటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో టెలి మెడిసిన్ కూడా అందిస్తున్నామని, సేవలు ఉపయోగించుకునే వారు సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు 08045811138 కాల్ చేయాలని సూచించారు. ప్రస్తుతం 150 బెడ్స్‌తో ఈకేర్ సెంటర్ నిర్వహిస్తున్నామన్నారు.  

Updated Date - 2021-05-12T22:27:41+05:30 IST