పెరిగిన సైబర్‌ నేరాలు

ABN , First Publish Date - 2020-05-22T06:56:00+05:30 IST

కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ కాలంలో సైబర్‌ నేరాలు అనూహ్యంగా పెరిగాయని ‘ కే7 కంప్యూటింగ్‌ సైబర్‌ థ్రెట్‌ రిపోర్టు’ వెల్లడించింది. సైబర్‌ దాడులకు సంబంధించి కేరళలో అత్యధిక ఘటనలు నమోదైనట్లు తెలిపింది. బెంగళూరు ఇతర మెట్రో...

పెరిగిన సైబర్‌ నేరాలు

కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ కాలంలో సైబర్‌ నేరాలు అనూహ్యంగా పెరిగాయని ‘ కే7 కంప్యూటింగ్‌ సైబర్‌ థ్రెట్‌ రిపోర్టు’ వెల్లడించింది. సైబర్‌ దాడులకు సంబంధించి కేరళలో అత్యధిక ఘటనలు నమోదైనట్లు తెలిపింది. బెంగళూరు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ తరహా నేరాలు అధికంగా నమోదయ్యాయట. వీటిల్లో అత్యధికం, యూజర్ల బ్యాంక్‌ ఖాతాల వివరాలు తదితర వ్యక్తిగత వివరాలు దొంగించేందుకు జరిగినవేనని రిపోర్టు పేర్కొంది. 

Updated Date - 2020-05-22T06:56:00+05:30 IST