ఎంపీ మాధవ్‌ పక్కన నా ఫొటో పెట్టి దుష్ప్రచారం

ABN , First Publish Date - 2022-08-08T10:01:35+05:30 IST

టీడీపీకి చెందిన కొందరు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో కాల్‌ వ్యవహారంలో ఆయన పక్కన తన ఫొటో పెట్టి, దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త అనితారెడ్డి ఆరోపించారు.

ఎంపీ మాధవ్‌ పక్కన నా ఫొటో పెట్టి దుష్ప్రచారం

  • లోకేశ్‌ డైరెక్షన్‌లో ఇదంతా టీడీపీ కుట్ర
  • పోలీసులకు వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త ఫిర్యాదు

కదిరి, ఆగస్టు 7: టీడీపీకి చెందిన కొందరు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో కాల్‌ వ్యవహారంలో ఆయన పక్కన తన ఫొటో పెట్టి, దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త అనితారెడ్డి ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట పోలీసుస్టేషన్‌లో ఆమె ఆదివారం ఫిర్యాదు చేశారు. గాండ్లపెంట మండలానికి చెందిన అనితారెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా వైసీపీ సోషల్‌ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేస్తున్నానని.. అప్పటినుంచి టీడీపీకి చెందిన వారు తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ఎంపీ మాధవ్‌ పక్కన తన ఫొటో పెట్టడం టీడీపీ కుట్ర అని.. ఇది టీడీపీ ఆఫీసు నుంచే.. లోకేశ్‌ డైరెక్షన్‌లోనే సాగుతోందని అన్నారు. మహిళలను ఇంతలా వేధించడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా రెండేళ్లుగా తమను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. తన భర్త ఫొటోను మార్ఫింగ్‌ చేసి వ్యక్తిగతంగా దూషించినా భరించానన్నారు. ఎంపీ మాధవ్‌ వీడియో వ్యవహారంలో ఆయన పక్కన, తన ఫొటోను పెట్టి  సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారన్నారు. కరీమ్‌, వేణు, చందు, నవీన్‌కుమార్‌, రమణ అనే ఐదుగురు తనను సోషల్‌ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫొటో మార్ఫింగ్‌ చేసిన, సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారందరిపై చర్య లు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.

Updated Date - 2022-08-08T10:01:35+05:30 IST