ఐపీఎల్-2020: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2020-08-12T01:43:08+05:30 IST

యూఏఈలో ఐపీఎల్ 2020 సందడి మొదలుకానుంది. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నుంచి...

ఐపీఎల్-2020: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: యూఏఈలో ఐపీఎల్ 2020 సందడి మొదలుకానుంది. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నుంచి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు తాజాగా క్లియరెన్స్ కూడా అందడంతో టీమ్స్ కూడా యూఏఈకి దారి పడుతున్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆగస్ట్ 21న యూఏఈకి పయనం కానుంది.


అయితే.. యూఏఈకి వెళ్లే లోపు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ట్రైనింగ్ క్యాంప్‌కు సీఎస్‌కే జట్టు హాజరుకానున్నట్లు ఆ టీం సీఈవో కాశీ విశ్వనాథన్ మంగళవారం తెలిపారు. ధోనీ, రైనా, టీంలోని ఇతర సభ్యుల ఆగస్ట్ 16న చెన్నైకి చేరుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ఐపీఎల్ తొలి మ్యాచ్ జరగనుంది. నవంబర్ 10న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అబుదాబి, షార్జా, దుబాయ్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

Updated Date - 2020-08-12T01:43:08+05:30 IST