కలెక్టర్లు ధరణికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: సీఎస్

ABN , First Publish Date - 2021-02-12T22:38:39+05:30 IST

ధరణికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు లు సంబంధిత అధికారులతో సమీక్ష

కలెక్టర్లు ధరణికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: సీఎస్

హైదరాబాద్: ధరణికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు లు సంబంధిత అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ధీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించడంతో పాటు కియర్ చేయడానికి పలు చర్యలు తీసుకున్నట్లు సమావేశంలో గుర్తించారు. ధరణిలోని పెండింగ్ మ్యుటేషన్ మాడ్యూల్ ద్వారా 74688 ధరఖాస్తులు రాగా 62847 ధరఖాస్తులను కలెక్టర్లు పరిష్కరించారు. సంస్ధలకు, కంపెనీలకు పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయడానికి అవసరమైన మాడ్యూల్ ధరణిలో అందుబాటులో ఉంచడంతో పాటు ఎన్ఆర్ఐ మాడ్యూల్ ను కూడా అందుబాటులోకి తేవడం జరిగింది.  సంస్ధలు, కంపెనీల పేర రిజిష్ట్రేషన్ మాడ్యూల్ అభివృద్ధి దశలో ఉందని ఫిబ్రవరి,15 నాటికి అందుబాటులోకి తేవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలలో మాడ్యూల్ వినియోగంపై అధ్యయనం కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటుచేసి గ్రామాలలో పర్యటించాల్సిందిగా సి.యస్ ఆదేశించారు.


ఈ టీంలు మాడ్యూల్స్ అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి సలహాలు ఇస్తుంది. కలెక్టర్లు ధరణికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని ముఖ్యంగా పార్ట్-బి లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రధ్ధ చూపించాలని సి.యస్ ఆదేశించారు. ఈ సమావేశంలో సీఐజీ శేషాద్రి, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, టిఎస్ టిఎస్ యండి. జి.టి వెంకటేశ్వర్ రావు,  సిసిఎల్ఏ స్పెషల్ ఆఫీసర్ సత్యశారద, బి.రామయ్య (రిటైర్డ్), సిసిఎల్ ఏ ఓఎస్డి సుందర్ అబ్ నార్ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-12T22:38:39+05:30 IST