కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జీఎస్టి ట్యాక్స్ వసూలు:సీఎస్
ABN , First Publish Date - 2021-02-27T20:11:18+05:30 IST
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ట్యాక్స్ వసూళ్ల లో గణనీయమైన
హైదరాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ట్యాక్స్ వసూళ్ల లో గణనీయమైన పురోగతి లభిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. మరింత సమన్వయం, పన్ను వసూళ్ల పురోగతిని సమీక్షించడానికి రెగ్యులర్ గా ప్రతివారం సమన్వయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. జీఎస్టి ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర జియస్టి అధికారులతో సమన్వయ సమావేశం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగింది.
రాష్ట్రంలో పన్ను వసూళ్లకు సంబంధించి ప్రత్యేక కమిటీలతో ప్రత్యేక రెవెన్యూ డ్రైవ్ లను చేపట్టామన్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా పన్ను వసూళ్లు చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేందుకు పరస్పర సహకారం అందించుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సిజిఎస్టి హైదరాబాద్ ఛీఫ్ కమీషనర్ మల్లికా ఆర్యా, స్టేట్ ట్యాక్స్ కమీషనర్ నీతూ కుమారి ప్రసాద్, సిజిఎస్ టి హైదరాబాద్ ప్రిన్సిపల్ కమీషనర్ పురుషోత్తం, సిజిఎస్ టి మేడ్చల్ కమీషనర్ శ్రీధర్, సికింద్రాబాద్ & రంగారెడ్డి కమీషనర్ యం.ఆర్.ఆర్.రెడ్డి మరియు రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.