సీఎస్ సానుకూలంగా స్పందించారు: టీఎన్జీఓ అధ్యక్షుడు
ABN , First Publish Date - 2021-12-08T01:19:06+05:30 IST
కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎస్ సమావేశం
హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారానికి సీఎస్ సోమేష్ కుమార్ సానుకూలంగా స్పందించారని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎస్ సమావేశం ముగిసింది. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎస్ను కోరామన్నారు. గతంలో ఆయా జిల్లాల్లో పనిచేసిన సీనియర్ అధికారులను నియమించాలని కోరామన్నారు. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా చూడాలని కోరామని ఆయన పేర్కొన్నారు. వీటికి సీఎస్ సానుకూలంగా స్పందించారన్నారు. జోనల్ పోస్టుల విభజన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.