పెళ్లి పత్రికలో తమ పేర్లు వేయలేదని..
ABN , First Publish Date - 2021-06-21T18:09:10+05:30 IST
పెళ్లి పత్రికలో తమ పేర్లు వేయలేదని ఇద్దరు అన్నదమ్ములు రెచ్చిపోయారు.
హైదరాబాద్: పెళ్లి పత్రికలో తమ పేర్లు వేయలేదని ఇద్దరు అన్నదమ్ములు రెచ్చిపోయారు. కత్తితో విచక్షణారహితంగా పెళ్లికొడుకు బంధువులపై దాడి చేశారు. ఈ ఘటనలో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లోని తుకారం గేట్లో ఈ ఘటన కలకలం రేపింది. మూడు రోజుల క్రితం చంద్రశేఖర్ నగర్కు చెందిన సురేష్ వివాహం జరిగింది. అయితే శుభలేఖలో తమ పేర్లు ఎందుకు పెట్టలేదని పెళ్లికొడుకు బంధువు సర్వేస్, పెళ్లికొడుకు సోదరి బాలామణితో గొడవకు దిగాడు. పెళ్లిలో గొడవ ఎందుకని, తర్వాత మాట్లాడదామని బంధువులు సర్దిచెప్పారు. మూడు రోజుల తర్వాత బాలామణి తన కుటుంబ సభ్యులు, బంధువులను తీసుకుని సర్వేస్ ఇంటికి వెళ్లింది. దీంతో సర్వేస్ సోదరుడు శేఖర్ శివాలెత్తిపోయాడు. ఇంటికొచ్చినవారిపై కత్తితో దాడి చేశాడు. దాడిలో ఎస్ ప్రవీణ్, నోముల పరశురామ్, డి యాదగిరి, ఎన్ ప్రతాప్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. గాయాలతోనే బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.