పబ్జీలో మునిగి తేలుతున్న ఎంఎస్ ధోనీ.. నిద్రలో కూడా..
ABN , First Publish Date - 2020-06-01T00:49:19+05:30 IST
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పబ్జీలో మునిగి తేలుతున్నాడట. ఈ మాట ఆయన భార్య ...
రాంచీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పబ్జీలో మునిగి తేలుతున్నాడట. ఈ మాట ఆయన భార్య సాక్షిధోనీనే చెప్పారు. ‘నా భర్త పబ్జీకి దాసుడైపోయాడు. ఎంతలా అంటే నిద్రలో కూడా దాని గురించే కలవరిస్తున్నాడు’ అంటూ సాక్షి వాపోయారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ఇన్స్టాగ్రాం లైవ్లో పాల్గొన్న ‘లాక్డౌన్లో ధోనీ ఏం చేస్తున్నారు..?’ అనే ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. ‘ధోనీ ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి అవిశ్రాంతంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీడియో గేమ్లు ఆడుతున్నప్పుడు మాత్రం ఆ ఆలోచనలు కొంచెం మళ్లుతాయి. అది సంతోషకరమే అయినా ఈ మధ్య ఆయన పబ్జీ వ్యసనం బాగా పెరిగిపోయింది. నిద్రలో కూడా దాని గురించే కలవరిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.