ఉండవల్లిలో రైతులతో CRDA చర్చలు

ABN , First Publish Date - 2022-06-15T19:54:28+05:30 IST

తాడేపల్లి మండలం ఉండవల్లిలో కరకట్ట రోడ్డు విస్తరణ బాధిత రైతులతో సీఆర్డీఏ చర్చలు నిర్వహించింది.

ఉండవల్లిలో రైతులతో CRDA చర్చలు

అమరావతి: తాడేపల్లి మండలం ఉండవల్లిలో కరకట్ట రోడ్డు విస్తరణ బాధిత రైతులతో సీఆర్డీఏ చర్చలు నిర్వహించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గజానికి రూ.5 వేలు ఇచ్చేందుకు సిద్ధమని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. అయితే గజానికి రూ. 10 వేలు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే రోడ్డు విస్తరణ పనులను అడ్డుకుంటామన్న రైతులు స్పష్టం చేశారు. దీంతో సీఆర్డీఏ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. 

Updated Date - 2022-06-15T19:54:28+05:30 IST