అందుకే విద్యుత్ పన్నుల పెంపు: cpm raghavulu
ABN , First Publish Date - 2022-05-19T21:19:26+05:30 IST
అందుకే విద్యుత్ పన్నుల పెంపు: cpm raghavulu
అమరావతి: కేంద్ర సంస్కరణలకు తలొగ్గే ఏపీలో విద్యుత్ పన్నుల పెంపని సీపీఎం నేత రాఘవులు అన్నారు. స్టీల్ప్లాంట్ విషయంలో ఏపీ ప్రభుత్వంలో నిజాయితీ కనిపించడం లేదని, ఓట్ల కోసమే జగన్ మొక్కుబడి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులకు కేంద్రం భంగం కలిగిస్తున్నా వైసీపీ ప్రశ్నించడం లేదన్నారు. ప్రతిపక్షం కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. స్టీల్ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం నినదిస్తే మద్దతిస్తామన్నారు.