36వ డివిజన్ ఏకగ్రీవం చెల్లదంటూ సీపీఎం నిరసన

ABN , First Publish Date - 2021-03-04T19:56:37+05:30 IST

చిత్తూరు: 36వ డివిజన్ ఏకగ్రీవం చెల్లదంటూ సీపీఎం నిరసన వ్యక్తం చేసింది. ఫోర్జరీ సంతకాల ద్వారా ఉపసంహరణ చేసి వైసీపీ ఏకగ్రీవం అయినట్లు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

36వ డివిజన్ ఏకగ్రీవం చెల్లదంటూ సీపీఎం నిరసన

చిత్తూరు: 36వ డివిజన్ ఏకగ్రీవం చెల్లదంటూ సీపీఎం నిరసన వ్యక్తం చేసింది. ఫోర్జరీ సంతకాల ద్వారా ఉపసంహరణ చేసి వైసీపీ ఏకగ్రీవం అయినట్లు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా గెలిచిన వైసీపీ అభ్యర్థి డిక్లరేషన్‌ను రద్దు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చల్లా వెంకటయ్య కిడ్నాప్ చేసిన వైసీపీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరులో మొత్తం 37 డివిజన్‌లను ఫోర్జరీ సంతకాలు ద్వారా ఉపసంహరణ చేసుకుని ఏకగ్రీవం చేసుకోవడం అన్యాయమన్నారు.

Updated Date - 2021-03-04T19:56:37+05:30 IST