సీఎం ప్రకటనపై సీపీఐ పెదవి విరుపు

ABN , First Publish Date - 2020-03-27T08:25:31+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మీడియా సమావేశంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం అనేక ముఖ్యమైన అంశాలపై కీలక...

సీఎం ప్రకటనపై సీపీఐ పెదవి విరుపు

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మీడియా సమావేశంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం అనేక ముఖ్యమైన అంశాలపై కీలక ప్రకటన చేస్తారని ప్రజలు ఆశించారని అన్నారు. ముంబయి, హైదరాబాద్‌ నగరాల్లోనూ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అభద్రతాభావంతో ఉన్న వలస కూలీల గురించి సీఎం ఎక్కడా ప్రస్తావించకపోవడాన్ని  తప్పుపట్టారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలన్న డిమాండుపై ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. వైద్యానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలు గురించి వివరించి ఉండాల్సిందన్నారు. రాజధాని రైతులు 100 రోజులుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు.  

Updated Date - 2020-03-27T08:25:31+05:30 IST