విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఉపరాష్ట్రపతి అపొచ్చు: నారాయణ
ABN , First Publish Date - 2021-11-02T02:29:44+05:30 IST
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ చేసిన పోరాటంలో తనతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా ఎందరో పాల్గొన్నారని సీపీఐ నారాయణ గుర్తుచేశారు.
అమరావతి: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ చేసిన పోరాటంలో తనతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా ఎందరో పాల్గొన్నారని సీపీఐ నారాయణ గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్రాన్ని ఆదేశించే స్థాయిలో ఉన్న వెంకయ్యనాయుడు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఆపొచ్చన్నారు. విశాఖ జలమార్గం నుండే స్మగ్లింగ్ జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఆఫ్ఘానిస్తాన్ నుండి హెరాయిన్ సప్లై అవుతుందన్నారు. స్మగ్లింగ్ వ్యాపారం చేయబట్టే ఆదానీలకు వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. ఇలాంటి వారందరూ కేంద్రం కనుసన్నల్లో ఉండబట్టే వారి కోసం అన్నీ అమ్మేస్తున్నారని చెప్పారు. బీజేపీతో దోస్తీ చేస్తున్న పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఉంటే మోదీని నిలదీయాలని నారాయణ డిమాండ్ చేశాడు. మోసపూరిత మాటలు చెప్పుకుంటూ తిరగడం అనవసరమన్నారు.