రోడ్డుపై కొత్తిమీర నాట్లు వేసి సీపీఐ నాయకుల వినూత్న నిరసన

ABN , First Publish Date - 2021-07-22T22:51:42+05:30 IST

అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ గుంతలతో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోడ్లు భవనాల......

రోడ్డుపై కొత్తిమీర నాట్లు వేసి సీపీఐ నాయకుల వినూత్న నిరసన

అనంతపురం: అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ గుంతలతో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఇలాకాలో అధ్వానంగా ఉన్న రోడ్లలో సీపీఐ నాయకులు కొత్తిమీర నాట్లు నాటి నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి గ్రామంలో సీపీఐ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రహదారి గుండా నిత్యం వందల సంఖ్యలో అనంతపురం నుంచి హిందూపురం పట్టణాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు, మంత్రి శంకర్ నారాయణ స్పందించి మరమ్మతులు చేపట్టాలని సీపీఐ నాయకులు కోరారు.







Updated Date - 2021-07-22T22:51:42+05:30 IST