ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్న CPI నేతలు

ABN , First Publish Date - 2022-06-21T17:58:43+05:30 IST

kadapa నగరంలోని తిలక్ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్వ విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతను బాధితులతో..

ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్న CPI నేతలు

kadapa : kadapa నగరంలోని తిలక్ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్వ విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతను బాధితులతో కలిసి CPI నేతలు అడ్డుకున్నారు. JCB యంత్రానికి అడ్డుగా నిలబడి ఎమ్మార్వోను బాధితులు నిలదీశారు. ముందు నగరంలో జలమమయ్యే ప్రాంతాల్లో కాల్వ విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బాధితులకు, పోలీసులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. దౌర్జన్యంగా గుడారాలు కూల్చి వేయడం తగదని సీపీఐ నేతలు హెచ్చరించారు. అధికార పార్టీ నేతలెవరైనా ఓట్లు అడగటానికి వస్తే తమ సత్తా చూపిస్తామని బాధితులు పేర్కొన్నారు.


Updated Date - 2022-06-21T17:58:43+05:30 IST