ప్రధాని నరేంద్రమోడీ జాతికి క్షమాపణ చెప్పాలి: Ramakrishna

ABN , First Publish Date - 2022-06-18T17:07:01+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

ప్రధాని నరేంద్రమోడీ జాతికి క్షమాపణ చెప్పాలి: Ramakrishna

విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...  విజయవాడలో యువజన, విద్యార్థి నేతలను నిన్నటి నుండి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. భారత సైన్యంలో కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసే అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. పెద్ద నోట్ల రద్దు దగ్గర నుండి నల్ల వ్యవసాయ చట్టాల వరకు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలకు తెరతీసిందని మండిపడ్డారు. అరెస్టు చేసిన ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులను తక్షణం విడుదల చేయాలని  రామకృష్ణ డిమాండ్ చేశారు.


Updated Date - 2022-06-18T17:07:01+05:30 IST