కడుపు మంటతోనే ఏపీ ఉద్యోగులు రోడ్డు మీదకొచ్చారు: Narayana

ABN , First Publish Date - 2022-02-04T17:45:10+05:30 IST

కడుపుమంటతోనే ఏపీ ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారని సీపీఐ నేత నారాయణ అన్నారు.

కడుపు మంటతోనే ఏపీ ఉద్యోగులు రోడ్డు మీదకొచ్చారు: Narayana

అమరావతి: కడుపుమంటతోనే ఏపీ ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారని సీపీఐ నేత నారాయణ అన్నారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ సలహాదారులు అచ్చోసిన ఆంబోతులు మాదిరి వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. దేశ ప్రధాని మోదీనే రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారని.. జగన్ ఎంత? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చర్చల సందర్భంగా ఉద్యోగులను ఏపీ ప్రభుత్చం మోసం చేసిందన్నారు. చలో విజయవాడలో కమ్యూనిస్టులు పాల్గొన్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ఉద్యోగుల పోరాటానికి సీపీఐ పూర్తి మద్దతునిస్తోందని నారాయణ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-04T17:45:10+05:30 IST