ఫిబ్రవరిలో ఉద్యోగులకు మద్దతుగా సీపీఐ ఆందోళనలు

ABN , First Publish Date - 2022-01-30T01:43:09+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో

ఫిబ్రవరిలో ఉద్యోగులకు మద్దతుగా సీపీఐ ఆందోళనలు

గుంటూరు: ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో  సీపీఐ ఆధ్యర్యంలో ఆందోళనలు చేస్తామని ఆ పార్టీ నేత జంగాల అజయ్ కుమార్ తెలిపారు. నగరంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులను మోసం చేసిందే కాకుండా మంత్రులే బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. డైవర్షన్ రాజకీయాలు చేయడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదన్నారు. జిల్లాలో రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. రైతులను కనీసం పట్టించుకునే నాధుడే లేడన్నారు. రాజకీయాల్లో వినలేని భాషను మంత్రులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. 

Updated Date - 2022-01-30T01:43:09+05:30 IST