కువైత్‌లోని Indian Embassy లో కరోనా కలకలం.. ఆ సేవలు బంద్!

ABN , First Publish Date - 2021-11-07T18:48:49+05:30 IST

కువైత్‌లోని భారత రాయబార కార్యాలయంలో తాజాగా కరోనా కేసు నమోదు కావడం కలకలం సృష్టించింది.

కువైత్‌లోని Indian Embassy లో కరోనా కలకలం.. ఆ సేవలు బంద్!

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత రాయబార కార్యాలయంలో తాజాగా కరోనా కేసు నమోదు కావడం కలకలం సృష్టించింది. ఈ నెల 6న ఎంబసీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరైనవారితో పాటు పాజిటివ్‌గా వచ్చిన వ్యక్తిని కలిసిన వారందరూ కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ఎంబసీ అధికారులు మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఈ కరోనా కేసు నేపథ్యంలో తదుపరి నోటీసులు వచ్చే వరకు రాయబార కార్యలయానికి సంబంధించిన అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఎంబసీ అధికారులు వెల్లడించారు. అయితే, పబ్లిక్ సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. 

Updated Date - 2021-11-07T18:48:49+05:30 IST