దేశంలో 170.21 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-02-08T21:31:45+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

దేశంలో 170.21 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే భారీ ఎత్తున కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేపట్టింది. ఇప్పటి వరకూ 170.21 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 55.78 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 96.46 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,597 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,94,891 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 8.30 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-02-08T21:31:45+05:30 IST