పత్తి మొక్కలను తినేసిన కీటకాలు
ABN , First Publish Date - 2020-07-14T01:31:46+05:30 IST
ఓవైపు మిడతల దండు అంటూ ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు మిడతలను పోలిన కీటకాల దండు నేరుగా పత్తి చేనుపై పడింది. పత్తి మొక్కలను తీనేశాయి. వివరాల్లోకెళితే.. నిర్మల్
నిర్మల్: ఓవైపు మిడతల దండు అంటూ ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు మిడతలను పోలిన కీటకాల దండు నేరుగా పత్తి చేనుపై పడింది. పత్తి మొక్కలను తీనేశాయి. వివరాల్లోకెళితే.. నిర్మల్ జిల్లాలోని తానూరు మండలం వడ్ ఝరి గ్రామంలో పత్తి పంటపై చిన్నపాటి పురుగులు దాడి చేశాయి. పత్తి చేను తినేశాయి. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు వచ్చి ఆ పురుగులను పరిశీలించారు. అవి మిడతలు కావని, రైతులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. పంటకేం నష్టం కాదని భరోసా ఇచ్చారు.