ఏపీలో రెండో ఒమైక్రాన్ కేసు నమోదు
ABN , First Publish Date - 2021-12-22T18:30:49+05:30 IST
ఏపీలో రెండో ఒమైక్రాన్ కేసు నమోదు
అమరావతి: ఏపీలో రెండో ఒమైక్రాన్ కేసు నమోదయింది. తిరుపతిలో మహిళకు ఒమైక్రాన్ పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కెన్యా నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి తిరుపతికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఒమైక్రాన్ బాధిత మహిళను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.