కరోనా కట్టడికి మూడంచెల వ్యవస్థ: సాయిరెడ్డి
ABN , First Publish Date - 2020-03-27T08:32:51+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మూడంచెల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు...
అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మూడంచెల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. అసెంబ్లీ, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయి వరకూ మూడంచెల్లో ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ ఏర్పాటు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదేనని గురువారం ఆయన ట్వీట్ చేశారు.