తెలంగాణలో ప్రమాదకరంగా కరోనా వైరస్..ఒక్క రోజులోనే..
ABN , First Publish Date - 2021-04-17T17:05:25+05:30 IST
తెలంగాణలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయికి చేరకుంది. రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో....
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయికి చేరకుంది. రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,446 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 1,809 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 33,514లు ఉండగా..22,118 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మరో 598 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్లో పేర్కొంది.