గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-04-10T01:29:30+05:30 IST
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది.
గుంటూరు: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఓ కంప్యూటర్ ఆపరేటర్ తండ్రికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆపరేటర్ను క్వారంటైన్కు తరలించారు. భయాందోళనలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని కేంద్రం ప్రకటించింది.