కరోనా లక్షణాలు.. డాక్టర్ సూచనలను పట్టించుకోని ఉన్నతాధికారులు
ABN , First Publish Date - 2020-04-09T03:19:54+05:30 IST
సర్వజన ఆస్పత్రిలో నలుగురు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని వైద్యులు తెలిపారు.
అనంతపురం: సర్వజన ఆస్పత్రిలో నలుగురు వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని వైద్యులు తెలిపారు. ఈ నెల 4న కరోనాతో వృద్ధుడు మృతి.. వృద్ధుడికి వైద్య సిబ్బంది వైద్యం చేశారు. వృద్ధుడికి కరోనా లక్షణాలున్నాయంటూ డాక్టర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. డాక్టర్ సూచనలను ఉన్నతాధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు.