గుంటూరులో ముగ్గురు కరోనా అనుమానితులు.. ఆసుపత్రికి తరలింపు
ABN , First Publish Date - 2020-04-03T20:01:12+05:30 IST
ఏపీని కరోనా వణికిస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో కరోనా విస్తరించింది. పట్టణంలోని ఐటీసీ సమీపంలోని ఓ బిర్యానీ హోటల్లో ఉన్న ముగ్గురు
గుంటూరు: ఏపీని కరోనా వణికిస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో కరోనా విస్తరించింది. పట్టణంలోని ఐటీసీ సమీపంలోని ఓ బిర్యానీ హోటల్లో ఉన్న ముగ్గురు కరోనా అనుమానితులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే హోటల్ వెనుక నివాసం ఉంటున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా బాధితుడు ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్టు గుర్తించారు. మూడు రోజుల నుంచి అనుమానితులు ఉన్న హోటల్ నుంచి పార్సిల్ వెళ్తున్నారు. దీంతో బిర్యానీ పార్సిల్ తీసుకెళ్ళిన సిబ్బంది ఆందోళనలో ఉన్నారు. వీరితో పాటుగా బిర్యానీ ఆర్డర్ చేసిన వినియోగదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం నాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరుకుంది. ఇవాళ నెల్లూరు-8, విశాఖ-3, కడపలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయి.